Header Banner

కాళేశ్వరం నోటీసులు! కేసీఆర్ బండారం బయటపెడతానన్న ఈటల రాజేందర్!

  Wed May 21, 2025 13:13        Politics

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ నుంచి తనకు అందబోతున్న నోటీసుల అంశంపై బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. తాను నోటీసులకు భయపడబోనని, కేసీఆర్ హయాంలో జరిగిన విషయాలను అవసరమైతే వెల్లడిస్తానని ఆయన హెచ్చరిక ధోరణిలో వ్యాఖ్యానించారు. ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ ఈటల పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తనతో పాటు మంత్రులుగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి వంటి నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, వారికి అప్పటి పరిస్థితులు తెలియవా అని ఈటల ప్రశ్నించారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణారావే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్‌తో విభేదించడానికి అందరూ జంకుతున్న రోజుల్లోనే తాను ఆరు నెలల పాటు ఎలా పోరాటం చేశానో తెలంగాణ సమాజం మొత్తం చూసిందని, కాబట్టి ఇలాంటి నోటీసులకు తాను భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.

తనకు ఇంకా కమిషన్ నుంచి అధికారికంగా ఎలాంటి నోటీసులు అందలేదని, ఒకవేళ వస్తే పార్టీ అనుమతి తీసుకుని తప్పకుండా స్పందిస్తానని ఈటల తెలిపారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, వాటి పర్యవసానాల గురించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరినవారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన ఒక మంత్రివర్గ ఉపసంఘంలో తాను, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి సభ్యులుగా ఉన్నామని, ఆ కమిటీ కొనసాగుతుండగానే తెరవెనుక ఏం జరిగిందో త్వరలోనే మీడియాకు వెల్లడిస్తానని అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇంజినీర్లే, ముఖ్యమంత్రి చెప్పినట్లుగానే ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టామని చెబుతున్నప్పుడు, ఇక మంత్రుల నిర్ణయాలపై ఏం విచారణ చేస్తారని ఈటల నిలదీశారు. తనకు నోటీసులు ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభాసుపాలవుతారని ఆయన వ్యాఖ్యానించారు. విచారణ కమిషన్ గడువును పదేపదే ఎందుకు పొడిగిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కమిషన్‌ను నిజంగా ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేశారా, లేక రాజకీయ బ్లాక్‌మెయిల్ కోసం వాడుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ఇకపై నో టెన్షన్..! విమానాల తరహాలో బస్సుల్లో కూడా..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

ఎవ్వరూ మాట్లాడొద్దు..! లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #KaleshwaramScam #EtelaVsKCR #KCRCorruption #EtelaRajender #TelanganaPolitics #KaleshwaramProject